Ad Code

మహాలక్ష్మి అమ్మవారి రెండుచేతుల్లోను పద్మాలు ఎందుకు


మహాలక్ష్మి అమ్మవారి రెండుచేతుల్లోను పద్మాలు ఎందుకు

మహాలక్ష్మి అమ్మవారిని శ్రీసూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు.
ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో ఋక్కులు కనబడతాయి.
“పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మ సంభవే” అని అన్ని పద్మ విశేషణాలు వాడారు. పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి మోము కలది, పద్మం నుండి పుట్టినది అని సూక్తం వర్ణిస్తుంది. పంకం నుండి పుట్టినది పద్మం కానీ ఆ చిక్లీతను (బురదను) అంటించుకోదు. సంసారంలో ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది.
పద్మం సూర్యుని చూసి వికసిస్తుంది, అలాగే మనం కూడా పరమాత్మ వైపు మంచి విషయాలపై మాత్రమె అనురక్తి ఉండాలి అని మరొక సంకేతార్ధం.
నీటి మీద ఉన్న ఆ పద్మం చాలా చంచలం.
ఆ పువ్వు మీద ఆసీనురాలైన ఆవిడ కూడా ధర్మం ఉన్నన్నాళ్ళే వారి దగ్గర ఉంటుంది. విష్ణు నాభి కమలం నుండి ఉద్భవించాడు చతుర్ముఖ బ్రహ్మ, అటుపై అక్కడనుండి సృష్టి ఆవిర్భావం.
ఆ బ్రహ్మతత్త్వాన్ని తెలిపే సంకేతంగా మరొక పద్మం.
అమ్మవారి రెండు కర కమలాలలో భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతి అనుగ్రహాలు ఉన్నాయి. వాటికి చిహ్నంగా అలా కనిపిస్తుంది.
ఆ తల్లి రూపాన్ని ఋషులు, మహర్షులు ధ్యానతపస్సులో దర్శించి తరించారు. వాటినే మనకు అందించారు.
లక్ష్మీదేవి 16 రకాల సంపదను అనుగ్రహించే తల్లి: జ్ఞానం, తెలివి, బలం, శౌర్యం, వీరం, అందం, జయం, కీర్తి, ధృతి, నైతికత, ధనం, ధాన్యం, ఆనందం, ఆయుష్షు, ఆరోగ్యం మరియు సంతానం. ఆ తల్లి మానవుల కోరికలను తీర్చేందుకు ఎనిమిది రూపాలలో అష్టలక్ష్మిగా సుప్రసిద్ధం. నిత్యం శ్రీ వేంకటేశుని వక్షస్థలంపై వసించి మనల్ని అనుగ్రహించి, మన తరపున మొరలు స్వామికి నివేదించి మనల్ని రక్షిస్తూ, అనుగ్రహిస్తున్న మా అమ్మ లక్ష్మీదేవకి సాష్టాంగనమస్కారం చేస్తూ ఆవిడ అనుగ్రహాన్ని అభిలషిస్తూ,
మహాలక్ష్మీ నమోస్తుతే





Post a Comment

0 Comments