Ad Code

సృష్టి రహస్య విశేషాలు - Srushti Rahasyamulu


సృష్టి రహస్య విశేషాలు



1 సృష్టి ఎలా ఏర్పడ్డది.
2 సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది.
3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి.

( సృష్ఠి ) ఆవిర్బావము:
1 ముందు (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2 శివం యందు శక్తి
3 శక్తి యందు నాదం
4 నాదం యందు బిందువు
5 బిందువు యందు సదాశివం
6 సదాశివం యందు మహేశ్వరం
7 మహేశ్వరం యందు ఈశ్వరం
8 ఈశ్వరం యందు రుద్రుడు
9 రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11 బ్రహ్మ యందు ఆత్మ
12 ఆత్మ యందు దహరాకాశం
13 దహరాకాశం యందు వాయువు
14 వాయువు యందు అగ్ని
15 ఆగ్ని యందు జలం
16 జలం యందు పృద్వీ.
పృద్వీ యందు ఓషధులు
17 ఓషదుల వలన అన్నం
18 ఈ అన్నము వల్ల నర మృగ పశు పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి.

( సృష్ఠి ) కాల చక్రం:
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఏంతో మంది శివులు ఏంతోమంది విష్ణువులు ఏంతోమంది బ్రహ్మలు వచ్చారు ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగలకు 1 మహయుగం.
71 మహ యుగలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి ఒక కల్పం.
15 సందులకు ఒక ప్రళయం ఒక కల్పం
1000 యుగలకు బ్రహ్మకు పగలు సృష్ఠి .
1000 యుగాలకు ఒక రాత్రి ప్రళయం.
2000 యుగాలకు ఒక దినం.
బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. శ్వేతవారహ యుగంలో ఉన్నాం.
5 గురు భాగన కాలంకు 60 సం
1 గురు భాగన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు 3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం. 2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార. 3 నక్షత్రం. 4 కరణం. 5 యోగం.

సృష్ఠి యవత్తు త్రిగుణములతోనే ఉంటుంది

దేవతలు జీవులలో చేట్లు అన్ని వర్గలలో మూడే గుణములు ఉంటాయి
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం

( పంచ భూతంలు అవిర్బావాం )
1 ఆత్మ యందు ఆకాశం
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.

5 ఙ్ఞానింద్రియంలు
5 పంచ ప్రాణంలు
5 పంచ తన్మాత్రలు
5 ఆంతర ఇంద్రియంలు
5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు

1 ( ఆకాశ పంచికరణంలు )
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల ( ఆహంకారం ) పుడుతుతున్నాయి

2( వాయువు పంచికరణంలు )
వాయువు - వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

3 ( అగ్ని పంచికరణములు )
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో ( ఘ్రాణం ) పుట్టేను.

4 ( జలం పంచికరణంలు )
జలం - ఆకాశంలో కలవడంవల్ల ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల ( స్పర్ష )
జలం - అగ్నిలో కలవడంవల్ల ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల ( గంధం )పుట్టేను.

5 ( భూమి పంచికరణంలు )
భూమి - ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల ( పాని )
భూమి - అగ్నితో కలవడంవల్ల ( పాదం )
భూమి - జలంతో కలవడంతో ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల ( గుదం ) పుట్టేను.

( మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానింద్రియంలు
1 శబ్ద
2 స్పర్ష
3 రూప
4 రస
5 గంధంలు.

5 ( పంచ తన్మాత్రలు )
1 చెవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు

5 ( పంచ ప్రాణంలు )
1 అపాన
2 సామనా
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన

5 ( అంతఃర ఇంద్రియంలు ) 5 ( కర్మఇంద్రియంలు )
1 మనస్సు
3 బుద్ది
3 చిత్తం
4 జ్ఞానం
5 ఆహంకారం

1 వాక్కు
2 పాని
3 పాదం
4 గుహ్యం
5 గుదం

6 ( అరిషడ్వర్గంలు )
1 కామం
3 క్రోదం
3 మోహం
4 లోభం
5 మదం
6 మచ్చార్యం

3 ( శరీరంలు )
1 స్థూల శరీరం
2 సూక్ష్మ శరీరం
3 కారణ శరీరం

3 ( అవస్తలు )
1 జాగ్రదవస్త
2 స్వప్నవస్త
3 సుషుప్తి అవస్త

6 ( షడ్బావ వికారంలు )
1 ఉండుట
2 పుట్టుట
3 పేరుగుట
4 పరినమించుట
5 క్షిణించుట
6 నశించుట

6 ( షడ్ముర్ములు )
1 ఆకలి
2 దప్పిక
3 శోకం
4 మోహం
5 జర
6 మరణం

7 ( కోశములు ) ( సప్త ధాతువులు )
1 చర్మం
2 రక్తం
3 మాంసం
4 మేదస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్లం

3 ( జీవి త్రయంలు )
1 విశ్వుడు
2 తైజుడు
3 ప్రఙ్ఞాడు

3 ( కర్మత్రయంలు )
1 ప్రారబ్దం కర్మలు
2 అగామి కర్మలు
3 సంచిత కర్మలు

5 ( కర్మలు )
1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద

3 ( గుణంలు )
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం

9 ( చతుష్ఠయములు )
1 సంకల్ప
2 అధ్యాసాయం
3 ఆభిమానం
4 అవధరణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్ష

10 ( 5 పంచభూతంలు పంచికరణ చేయనివి )
( 5 పంచభూతంలు పంచికరణం చేసినవి )
1 ఆకాశం
2 వాయువు
3 ఆగ్ని
4 జలం
5 భూమి

14 మంది ( అవస్థ దేవతలు )
1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వీని దేవతలు
6 ఆగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతర్వకుడు
12 రుద్రుడు
13 క్షేత్రజ్ఞుడు
14 ఈశానుడు

10 ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )
1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాందారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ

10 ( వాయువులు )
1 అపాన
2 సమాన
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యానా
6 కూర్మ
7 కృకర
8 నాగ
9 దేవదత్త
10 ధనంజమ

7 ( షట్ చక్రంలు )
1 మూలాధార
2 స్వాదిస్థాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ది
6 ఆఙ్ఞా
7 సహస్రారం

( మనిషి ప్రమాణంలు )
96 అంగళంలు
8 జానల పోడవు
4 జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీల్లు
37 మురల ప్రేగులు
1 సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4 సేర్లు మాంసం
1 సరేడు పైత్యం
అర్దసేరు శ్లేషం

( మానవ దేహంలో 14 లోకలు ) పైలోకలు 7
1 భూలోకం - పాదాల్లో
2 భూవర్లలోకం - హృదయంలో
3 సువర్లలోకం - నాభీలో
4 మహర్లలోకం - మర్మంగంలో
5 జనలోకం - కంఠంలో
6 తపోలోకం - భృమద్యంలో
7 సత్యలోకం - లాలాటంలో

అధోలోకలు 7
1 ఆతలం - అరికాల్లలో
2 వితలం - గోర్లలో
3 సుతలం - మడమల్లో
4 తలాతలం - పిక్కల్లో
5 రసాతలం - మొకల్లలో
6 మహతలం - తోడల్లో
7 పాతాళం - పాయువుల్లో

( మానవ దేహంలో సప్త సముద్రంలు )
1 లవణ సముద్రం - మూత్రం
2 ఇక్షి సముద్రం - చేమట
3 సూర సముద్రం - ఇంద్రియం
4 సర్పి సముద్రం - దోషితం
5 దది సముద్రం - శ్లేషం
6 క్షిర సముద్రం - జోల్లు
7 శుద్దోక సముద్రం - కన్నీరు

( పంచాగ్నులు )
1 కాలగ్ని - పాదాల్లో
2 క్షుదాగ్ని - నాభీలో
3 శీతాగ్ని - హృదయంలో
4 కోపాగ్ని - నేత్రంలో
5 ఙ్ఞానాగ్ని - ఆత్మలో

7 ( మానవ దేహంలో సప్త దీపంలు )
1 జంబు ద్వీపం - తలలోన
2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన
3 శాక ద్వీపం - శిరస్సుప
4 శాల్మల ధ్వీపం - చర్మంన
5 పూష్కార ద్వీపం - గోలమందు
6 కూశ ద్వీపం - మాంసంలో
7 కౌంచ ద్వీపం - వేంట్రుకల్లో

10 ( నాధంలు )
1 లాలాది ఘోష - నాధం
2 భేరి - నాధం
3 చణీ - నాధం
4 మృదంగ - నాధం
5 ఘాంట - నాధం
6 కీలకిణీ - నాధం
7 కళ - నాధం
8 వేణు - నాధం
9 బ్రమణ - నాధం
10 ప్రణవ - నాధం.ఓం. శనైశ్చ రాయనమః


సృష్టి – అర్థము, స్వభావము:
ఈ పదార్థ విశ్వం పరమాత్మ పొందిన పరిణామం కాదు అలాగని అది తనంతతానుగా వచ్చింది కాదు. పదార్థం, జీవుల యొక్క గర్భంలో పరమాత్మ వలన కలిగిన అంత: చైతన్యం వలన ఈ సృష్టి ప్రారంభమైంది. సృష్టి భగవంతుని అపారమైన కరుణకు, శక్తికి ఒక ప్రతీక. ఈ
విధమైన సృష్టి చేయాలని పరమాత్మకు ఎందుకు అనిపించింది. అప్పటివరకూ
నిద్రాణంగా తనలో ఉన్న సృజనా శక్తిని ఎందుకు జాగృతం చేసి ఈ సృష్టి
చేయవలసిన అవసరం వచ్చింది పరమాత్మకు?
ఈ ప్రశ్నలు అవశ్యం సాధకుల కు వచ్చేవే. అందుకే మధ్వాచార్యులు వీటికి సమాధానంగా చాలా వివరణలు ఇచ్చారు.

సృష్టి ఒక యథార్థ ప్రక్రియ. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఉన్న ముఖ్యమైన అంశాలు (కాలము, కర్మ, ద్రవ్యము, స్వభావముతో కూడుకున్న జీవులు) ఎల్లప్పుడూ పరబ్రహ్మంపై ఆధారపడి ఉంటాయి. పరమాత్మ శక్త , వ్యక్త స్థితుల్లో సందర్భానుసారంగా వ్యక్తమౌతూ ఈ సృష్టిని కొనసాగిస్తూ
ఉంటాడు. సర్వజ్ఞత, సత్తా అనే సహజమైన విశేషాలతో పరమాత్మ ఒక కాలక్రమంలో
సృష్టి, లయ అనే పరస్పర విరుద్ధమైన కార్యాలను చేస్తూ ఉంటాడు. ఈ కాలక్రమం
ఎప్పుడు మొదలెైంది మొట్టమొదటగా అనేది సాధకులకు అందే జ్ఞానం కాదు. ఇదే సనాతన జ్ఞానం. ఇది తెలిస్తేనే నేను ద్వైతాన్ని నమ్ముతాను లేదా భగవంతుని
అస్తిత్వాన్ని ఒప్పుకుంటాను అనే వితండ వాదాలకు అతీతమైన జ్ఞానం అది.

సృష్టి ఆదిఎప్పుడు అనేది ముక్త జీవాలకి సైతం అర్థం కాని విషయం. అదే పరమాత్మ తత్త్వం. ఆయనను పూర్తిగా వివరించగల సత్తా వాక్కుకి లేదు కనుక సాధకుల గ్రాహ్యత కు అందని విషయం అందుకే “భూతకృద్భూత భ్రుధ్భావో భూతాత్మా, భూత భావనః, అప్రమేయో హృషీకేశ: పద్మనాభోమరప్రభు:” అని భీష్మునిచే కీర్తించబడ్డాడు శ్రీకృష్ణుడు. జీవులు తీసుకున్న వివిధ ఉపాధులలో ఉండే
విశేషాలు, పుట్టే, గిట్టే సమయం వంటి వాటిని సహజమైన కాల భేదాలు (అవి కాలానికి, ఆకాశానికి ఉన్న స్వాభావిక విశేషాలు) నిర్ధారిస్తాయి. అలా
సృష్టించబడిన ఈ విశ్వం తనకు ఆధారభూతమైన పరమాత్మతో నిత్యం సంబంధాన్ని కలిగి ఉంటుంది. పరిపూర్ణుడు, మారని వాడు అయిన పరమాత్మ వలన ఈ విశ్వం నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ మారే విశ్వం నిరంతరం మారని పరబ్రహ్మతో కలసి ఉంటుంది “ప్రవాహతో అనాది ”. ఇలా స్వతంత్ర – పరతంత్ర మనే ద్వైత భావనలోనే పరమాత్మ తత్త్వం ద్యోతకమౌతుంది అనాదిగా. నిజానికి ద్వైతం మధ్వాచార్యులు మరల సాధకులకు అందించిన అనాదియైన సాధనా విధానం.

మహాప్రళయం -సృష్టి ఆవిర్భావం -ఋషులు – జీవరాసి
అపారమైన జ్ఞాన విజ్ఞానము లకు, సంస్కృతి సంప్రదాయా లకు ఆలవాలమైన దేశం మన భారత దేశం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మూలాధారం ఋషులు, జీవరాశికి మూలపురుషులు ఋషులే. మనను నిత్యమూ నడిపిస్తూ,మనకుసంప్రదాయాన్ని ఇచ్చినవారు ఋషులు. ఈ ఋషులు భౌతికమైన ప్రపంచా నికి తండ్రులు. బ్రహ్మ ముఖం నుండి వేదం పుట్టింది, కాని దానిని మనకు ప్రసాదించినది ఋషులే. ఋషి అంటే మంత్రద్రష్ట, త్రికాలజ్ఞాని, సద్గురువు, వేదవిజ్ఞాన ప్రచారకుడు, తపశ్శాలి , మానవాళికి మార్గదర్శకుడు.

ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు సందేహం కలుగుతుంది – నేనెవరు, నా మూలపురుషులెవరు, వారి చరిత్ర ఎటువంటిది అని – దీనికి ముందుగా మనం కొంత సృష్టి ఆవిర్భావం గురించి (క్లుప్తంగా ) తెలుసుకొని – ఆ తరువాత మన ఋషులు, మనగోత్రాలు, ప్రవర చెప్పుకొందాం.

మానవులందరికీ మూలపురుషుడు మనువు. మనువు యొక్క సంతతి కాబట్టి మనం మనుషులం.

అసలు ఈ మనువు ఎవరు? సప్తఋషులు ఎవరు? ఇది తెలుసుకొందాం.

మహాప్రళయం తరవాత అనంత జలరాశిలో శయనించిన మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి ఉద్భవించిన బ్రహ్మకు సృష్టి భాద్యతని అప్పచెప్పాడు విష్ణుమూర్తి. కాని ఎలాగో చెప్పలెదు. ఆ నాభికమలం చాలా దూరం వెళ్ళిపోయింది, అక్కడ బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. సృష్టి ఎలా చెయ్యాలో తెలియలేదు, తెలుసుకొనేందుకు తపస్సు చేసాడు. ఆ తపస్సులో ఆయనకి అవగతం అయింది – ముందు నేను సృష్టికి హేతువు లైన ఋషులను సృష్టించాలి. అంటే వారికీ ప్రపంచ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము రెండు ఉంటాయన్నమాట. వాళ్ళే మానవాళికి మంచిచెడులు భోధించి చెపుతారు.

అలా బ్రహ్మ తలలోంచి మొదట పుట్టినవాళ్ళు – సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు పుట్టారు. వీరిని బ్రహ్మ మానసపుత్రులు అంటారు. కాని వాళ్ళు సహజంగా బ్రహ్మ జ్ఞానం ఉండటంతో సృష్టి కార్యక్రమం చెయ్యలేమని తపస్సు కు వెళ్లిపొయరు.

తరవాత బ్రహ్మ విశ్వంనందు జీవకోటిని సృష్టించుటకై మనువులను, శతరూప అనే సుందరిని, ప్రజాపతులను, ఋషులను సృష్టించాడు. ఆ తరవాత సృష్టిక్రమం ప్రారంభం అయింది. ఇది మనకి సంబంధించిన విశ్వం. ఇటువంటివి అనేకానేక విశ్వాలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి.

ఇప్పుడు బ్రహ్మ యొక్క కాలం గురించి తెలుసుకొందాం.

బ్రహ్మ యొక్క ఒక రోజు
“పగటి కాలాన్ని” ఒక
” కల్పము ” అంటారు. ఈ పగటి కాలాన్ని (14) పద్నాలుగు భాగాలుగా చేసి, ఒకొక్క భాగానికి ఒకొక్క మనువుని సృష్టించాడు. ఒకొక్క మనువు కాలం అయిపోగానే మళ్ళా కొత్త మనువుని సృష్టిస్తూఉంటాడు. మనువు, మనువుతో పాటు ప్రజాపతులు, సప్తఋషులు, రుద్రులను, ఇంద్రుడు, దేవతలు ఇలా.,

బ్రహ్మ ఒక రోజు పగటి కాలం (కల్పము ) = 1000 మహాయుగాలు (432,00,00,000 మానవ సంవత్సరాలు)

(43,20,000X 1000) (432 కోట్లు సంవత్సరాలు)

ఒక మహాయుగం = కృతయుగం + త్రేతాయుగం + ద్వాపరయుగం + కలియుగం (చాతుర్యుగాలు )

కలియుగం = 4,32,000 సం.।।లు

ద్వాపరయుగం = (432000 X 2) = 8,64,000సం.।।లు

త్రేతాయుగం = (432000X 3) = 12,96,000సం.।।లు

కృత(సత్య)యుగం = (432000X 4)= 17,28,000సం.।।లు

మొత్తం 43,20,000 సం.।।లు

బ్రహ్మగారి పగలు కాలం అంటే 1000 మహా యుగాలు పూర్తి అయితే ఒక మహాప్రళయం వస్తుంది. (end of kalpa ). భూమి, జీవకోటి మొత్తం ప్రళయంలో అంతం అయిపోతుంది, కాని విశ్వం ఉంటుంది. బ్రహ్మ గారి 1000 మహా యుగాల రాత్రి సమయం గడిచాక మళ్ళా సృష్టి పునరావృతం అవుతుంది.

1000 మహా యుగాలు పగలు + 1000 మహా యుగాలు రాత్రి కలిపితే బ్రహ్మ ఒక రోజు. దీన్ని మహాకల్పముఅంటారు. ఇలాంటి 360 రోజులైతే ఒక సంవత్సరం. బ్రహ్మ ఆయుర్దాయం 100 (దేవ) సంవత్సరాలు.

ప్రస్తుత బ్రహ్మ గారికి (మన గెలాక్సీ) మన శాస్త్రాల ప్రకారం 50 సంవత్సరాలు ( దేవ సంవత్సరాలు) గడచిపోయాయి.

ప్రస్తుతం బ్రహ్మగారి 51 వ సంవత్సరంలో పగటి కాలం 7వ మనువు కంట్రోల్ లో మనం ఉన్నము.

మనువు – మన్వంతరాలు:
ఇప్పుడు ఏదైతే జరుగుతోందో ఆ కల్పానికి (day of brahma) “శ్వేతవరాహ కల్పము ” అని పేరు. బ్రహ్మగారి పగటి కాలాన్ని (14) భాగాలు చేసి ఒకో భాగానికి ఒకో మనువును appoint చేసారని మనం చెప్పుకొన్నాం.

ఈ ప్రకారం ఒక మనువు కాలం = 71 మహాయుగాలు = 308571414 (మానవ)సంవత్సరాలు (71+కృతయుగ(approx )
ప్రస్తుతం మనం 7వ మనువైన “వైవస్వతమనువు” కాలంలో ఉన్నాము. దీన్ని “వైవస్వత మన్వంతరం” అంటారు.

ఈ “వైవస్వతమన్వంతరం” లో 27 మహాయుగాలు గడచిపోయాయి. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో నాలుగవదైన కలియుగంలో ఉన్నాము. (ఈ మహాయుగం లో మొదటి మూడు యుగాలు గడచిపోయాయి). కలియుగంలో ఇప్పటికి 5116 సంవత్సరాలు (out of 4,32,000 years) గడచిపోయాయి.

పూజ చేసుకొనే టప్పుడు సంకల్పం లో చెప్పుకొంటాము(మనం ఎక్కడ ఉన్నాం ఏ కాలంలో ఉన్నాం ) — శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతఖండే…

“వైవస్వతమనువు” గారు సృష్టి కార్యక్రమం చేపట్టి 27 మహాయుగాలుఅయిపొయింది (27X 43,20,000). ఇప్పుడు మనం 28వ మహాయుగంలో నాలుగవదైన కలియుగంలో ఉన్నము. కలియుగం ప్రవేశించి 5116 సంవత్సరాలు అయింది( ఇంకా 4,32,000-5116=4,26,884 ఉంది ). మనువుల వివరాలు కొన్నికొన్ని పురాణాల్లో కొంతకొంత తేడాలతో ఉన్నాయి. ముఖ్య ప్రమాణం భాగవతం, విష్ణుపురాణం.

సంక్షిప్తంగా ఈ కల్పం యొక్క కాలపరిమితులు ఇవి.
మనువు మారినప్పుడల్లా అంటే మన్వంతరంలో (71 మహాయుగాల అనంతరం) ప్రళయం వస్తుందా అంటే వస్తుంది అనే చాల పురాణాలు చెపుతున్నాయి, కాని అది కల్పాంతం అంటే బ్రహ్మగారి పగలు ముగిసి రాత్రి మొదలు అయ్యేటప్పుడు వచ్చేప్రళయం లా మొత్తం solar system అంతా లయం కాదు అంటున్నాయి.

మన పురాణాల్లో మూడు రకాలైన ప్రళయాలు చెప్పబడ్డాయి.
1. ప్రాకృతిక ప్రళయం లేదా మహాప్రళయం 311040000000000(311trillion 40billion ) అంటే బ్రహ్మగారి 100 దేవసంవత్స రాల ఆయుర్దాయం తరవాత. (బ్రహ్మగారి ఒక పగలు కాలం =4320,000000X 2 X 100) మొత్తం విశ్వం, పంచభూతాలు అంతా వినాశనం అవుతుంది. ఆ తరవాత పునః ప్రారంభం మొదలు పెడతారు with new brahma.

2. నైమిత్తిక ప్రళయం లేదా కల్పాంతం – అంటే బ్రహ్మ గారి ఒక పగలుకాలం – 4320,000000 (432 కోట్ల సంవత్సరాలు) అప్పుడొచ్చే ప్రళయంలో అన్ని జీవరాసులు నశించిపోతాయి, భూమి కుంగి పోతుంది, కాని విశ్వం ఉంటుంది – ఆయన రాత్రి నిద్రకి వెళ్ళేటప్పుడు జీవకోటి నంతా నాశనం చేసి మళ్ళా ఉదయం సృష్టి మొదలు పెడతారు

3. మన్వంతర ప్రళయ : ఒక మనువు కాలం అంటే 71 మహాయుగాలు (30.7 కోట్లు సంవ ) అప్పుడుకూడా ప్రళయం వస్తుంది, కానీ కల్పాంతం అంత పెద్దది కాదు, కాని ఇక్కడ కూడా జీవకోటి చాలా నశించిపోతుంది. భూమి కూడా కుంగుతుంది.

ఇవి కాక ఒక మహాయుగం అంటే (4) చాతుర్యుగాలు పూర్తి అయినప్పుడు ఒక ప్రళయం, జీవకోటికి అపార నష్టం కలుగుతుంది.ఇది కాక ఇంకా సౌర కుటుంబంలో వచ్చే ప్రళయాలు చాలా చెప్పారు మన పురాణాల్లో.

అన్ని పురాణాలలోను మహాప్రళయం ఒక భయంకరమైన వర్షంతో (deluge ) మొదలవుతుందని సమస్త ప్రాణికోటి నీటిలో పరిసమాప్తి అవుతుందని, భగవంతుడు ఒక మనిషిని సాక్షీభూతంగా భవిష్యత్తు మానవాళి కోసం ఎన్నుకొంటా డని అతడే మనువు (వైవస్వతమను) అని చెపుతున్నయి.బైబిల్లో కూడా ప్రళయం ఇంచుమించు ఇదే విధంగా వర్ణించారు – బైబిల్ ప్రకారం ఆ మానవుడు నోహ్ (NOAH). BIG BANG THEORY ప్రకారం ప్రళయం తరువాత విశ్వంలో జరిగే మార్పులు కూడా కొచెం ఇంచుమించులో ఇంతే.

మొత్తం మీద సారాంశం ఏమిటంటే ఈ విశ్వం సృస్టించ బడుతూ, లయం చెయ్యబడుతూ, మళ్ళా సృజించబడుతూ ఈ కాలచక్రాన్ని ఆ పరబ్రహ్మ (brahman ) అంటే అనంత శక్తిస్వరూపం దీన్ని ఇలా నడిపిస్తోంది. దీనికి ఆది లేదు అంతం లేదు, చావు, పుట్టుకల మద్యలో కాలచక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది .

మరి ఎప్పటివో ఈ విషయా లన్నీ మానవులకి ఎలా తెలిసాయి. జ్ఞాన, అజ్ఞానాల మధ్యలో మనుషులు ఎలా కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్ళకి మార్గదర్శకులు ఎవరు?

పూర్వకల్పంలో బ్రహ్మ మొదట సృష్టించిన అతడి మానస పుత్రులు సనకసనందనాదులు వాళ్ళు బ్రహ్మ జ్ఞానంతో సృష్టి కార్యంలో పాలుపంచుకొలెదు. తరవాత బ్రహ్మ ప్రజపతులను, దేవతలను, ఋషులను సృష్టించాడు. వాళ్ళే ఈ సృష్టిలో జ్ఞానులై పుట్టటం, సంతతిని వృది చెయ్యటం జరిగింది. బ్రహ్మ ఉద్దేశ్యం ఏమిటంటే – మనుషులు పెళ్ళిచేసుకోవాలి పిల్లల్ని కనాలి సంతానం వృది చెయ్యాలి భూమి కళకళ లాడాలి – ఇలా ఉండాలంటే వారికీ అవిద్య,అజ్ఞానం, దేహత్మభావన, దేహాభిమానం – ఇట్లాంటి లక్షణాలుంటే తప్ప మనుషులు వృది పొందరు. అందరూ శుద్ధజ్ఞానంలో ఉంటె సృష్టి జరగదు. కాబట్టి మనుషులలో అవిద్య, అజ్ఞానం ప్రవేశపెట్టారు.

ఈ సృష్టి రహస్యం, జీవకోటి లక్షణాలు అంతా సంపూర్ణంగా తెలిసినవారు, జగత్తు యొక్క భూత, భవిష్యత్, వర్తమానా లు తెలిసినవారు, జీవులకు ఏది క్షేమకరమో అది తెలిసిన వారు మహర్షులు. ఆద్యంతమూ సృష్టి రహస్యం తెలిసి, వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తూ మనకి కర్తవ్య భోధ చేస్తూ, పుట్టబోయేవారి యోగక్షేమాలు కూడా ఆలోచించే వారు మహర్షులు . అనేకమంది మహర్షులు ఆర్య సంస్కృతిని రక్షించి జీవకోటిని ఉద్దారించారు, వేదములు, దర్శనములు, స్మృతులు మొదలైన వాజ్మయప్రపంచాన్ని ఈ ప్రపంచానికి అందించారు.

ఇటువంటి మహనీయుల వంశపరంపరలో జన్మించిన మనకి మన గోత్రములు, ఋషులు తప్పక తెలియాలి, తెలుసుకోవటం మన ధర్మం. సంధ్యావందనం లో ప్రతి రోజు గోత్ర ప్రవరలు చెప్పుకోవాలని మన ధర్మశాస్త్రం చెపుతుంది.

ప్రతిమనిషికి విద్యావంశము, జన్మ వంశము ఉంటాయి . జన్మవంశము అంటే తండ్రి, తాత,ముత్తాత పేర్లు,
విద్యా వంశము అంటే తన గురువు నుండి వారి గురువు వారినుండి భగవంతుని వరకు. ఈ రెండూ కాక గోత్ర ప్రవర ప్రతివాళ్ళకి తెలియలి. గోత్రమున ఏ ఋషి పేరుంటుందో అతడే మన వంశమునకుమూలపురుషుడు, అతనినుండి ఈ వంశము ఆవిర్భవించింది, ఆ ఋషి యొక్క శిష్యులు, వారి శిష్యులు లేదా ఋషి తండ్రి, తాత, సోదరులు, ఇలా ప్రతి వంశానికి(1),(2), (3),(5),(7),(9) ఇలా ఋషులు ఉంటారు . మన పుట్టుకకి ఆధారమైన ఈ మహనీయులని మనం రోజు స్మరించుకోవాలి. వారి చరిత్రలు తెలుసుకోవాలి. ఋషి సమూహమున సప్తఋషులు పరమ పూజ్యులు నక్షత్ర రూపమున ఇప్పటికి దర్శనమిస్తున్నారు . వీరే కాకా జమదగ్ని, గౌతమ, వశిష్ట ఇలా చాల మంది మూల ఋషులుగా కలిగిన సుమారు (49) గోత్రముల ఋషి మూలములు ఉన్నట్లుగా అంచనా.

ప్రవర:
ప్రవర అంటే శ్రేష్టుడు అని అర్ధం. ప్రవర అంటేఎంతమంది శ్రేష్టులైన ఋషులు ఆ గోత్రంలో ఉన్నారో తెలియచెప్పేది.





Post a Comment

0 Comments