Ad Code

భారతీయ ధర్మమే చాలా గొప్పది, భారతీయులు ప్రపంచములోనే చాలా గొప్పవారు


భారతీయ ధర్మమే చాలా గొప్పది, భారతీయులు ప్రపంచములోనే చాలా గొప్పవారు




ఎలాగో మీరే చూడండి:

1)సూర్యుడి నుంచి వెలువడుతున్న ఓంకారమని నాసా ఎందుకు పేర్కొన్నట్టు?

2) మన దేశీయ గోమూత్రం మీద అమెరికా 4 పేటెంట్లను పొంది క్యాన్సర్ ను నివారించే మందును కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తోంది. ఎందుకు!?

3) న్యూజెర్సీ "సిటాన్ హాలు" యూనివర్సిటీలో భగవద్గీత తప్పనిసరిగా చదవాలన్న నియమం ఎందుకుంది?

4) ముస్లిం దేశమైన ఇండోనేసియా తన దేశ విమానయాన సంస్థకు "గరుడ ఇండోనేషియా ఎయిర్లైన్స్" అని, జాతీయ ఎంబ్లెమ్ కు "గరుడ పంచశిల" అని విష్ణు వాహనమైన గరుత్మంతుని పేర్లేందుకు పెట్టుకుంది?

5) ఇండోనేషియాలో అతిపెద్ద నోటైన ఇరవై వేల రూపయా మీద వినాయకుడి బొమ్మ ఉంటుందేం?

6) అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా తన జేబులో ఎప్పుడూ హనుమంతుడి చిత్రపటాన్ని పెట్టుకొని ఉంటాడెందుకూ?

7) యోగ, ప్రాణాయామాలకు ఈరోజు ప్రపంచంలో అంత గుర్తింపెందుకుంది?

8)వేల సంవత్సరాల క్రితమే భారతీయ యోగులు భూమి గుండ్రంగా ఉందని చెప్పారేం?

9) 'లుప్త', 'హంస' అంటే సంస్కృతంలో కనుమరుగవుతున్న హంస. విమానం ఆకాశంలో పైపైకి ప్రయాణిస్తున్నకొద్దీ కనుమరుగవుతూ ఉంటుంది. ఈ అర్థం వచ్చేలా జర్మనీ విమానయాన సంస్థకు 'లుఫ్తాన్సా' అని పేరెందుకు పెట్టారు?

10) ఆఫ్ఘసిస్తాన్ లోని పర్వతాలను "హిందూకుష్" పర్వతాలని ఎందుకంటారు?

11) వియత్నాంలో నాలుగు వేల సంవత్సరాల నాటి శ్రీమహావిష్ణు విగ్రహం ఎలా కనిపించింది?

12) అమెరికా శాస్త్రవేత్త  డా. హోవార్డ్ స్టెయిన్గెరిల్ పరిశోధన చేసి గాయత్రీ మంత్రం క్షణానికి 10 వేల ధ్వని తరంగాలను వెలువరిస్తుందని తేల్చారు. దీనివల్ల ఈ మంత్రం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మంత్రమని తెలిసింది. ఎందుకు?

13) స్వామి దయానంద సరస్వతి రాసిన "సత్యార్థ ప్రకాశ్" చదివి భాగపత్ (యూపీ)లోని బార్వాలా మసీదు ఇమాం 1983లో "మహేంద్ర పాల్ ఆర్య"  పేరుతో హిందువుగా మారారెందుకు? అప్పటినుంచి వేలమంది ముస్లింలను హిందువులుగా మారుస్తూ. డా. జకీర్ నాయక్ ను ఎన్నిసార్లు చర్చకు పిలిచినా ఆయన వచ్చే సాహసం చేయలేదేం?

14) హిందువులు చేసే యజ్ఞం మూఢనమ్మకమే అయితే, యజ్ఞం చేస్తూండిన ఒక్క "కుష్వాహా" కుటుంబమే భోపాల్ గ్యాస్ ప్రమాదం బారిన పడకుండా ఎలా తప్పించుకుంది?

15) ఆవు పేడతో చేసిన పిడకల మీద ఆవునెయ్యి వేసి కాలిస్తే ప్రతి 10 గ్రాములకి ఒక టన్ను ఆక్సిజన్ విడుదల అవుతుంది. వాయువును శుద్ధి చేస్తుంది. మరి ఇదంతా ఏంటి?

16) అమెరికా నటి, నిర్మాత జూలియా రాబర్ట్స్ హిందూ ధర్మాన్ని స్వీకరించి రోజూ గుడికి వెళ్తుందెందుకు?

17) రామాయణం మిథ్య అయితే, ప్రపంచంలోని రాళ్ళలో రామసేతువు నుంచి విడివడినవి మాత్రమే ఎందుకు నీటిపై తేలుతున్నాయి?

18) మహాభారతం కల్పితమైతే, ఉత్తర భారతంలో 80 అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరం నేషనల్ జాగ్రఫిక్, భారత సైన్యం బృందానికి ఎలా కనిపించింది?

19) 5000 సంవత్సరాల పురాతనమైనది, మహాభారత కాలం నాటిది అయిన విమానం అమెరికా సైన్యానికి కాందహార్ (ఆఫ్ఘనిస్తాన్)లో ఎలా దొరికింది?

20) అలెగ్జాండర్ మనదేశం నుండి పిడికెడు మట్టి కూడా తీసుకెళ్లాడా?

అందుకే, ప్రియమైన భారతీయులారా ఆత్మ బంధువులారా, భారతీయునిగా పుట్టినందుకు గర్వించండి.

భారతీయునిగానే మరణించండి.

మన భారతదేశ గొప్పతనాన్ని మనకన్నా విదేశీయులు బాగా గుర్తిస్తున్నారు.

మనదేశం యొక్క గొప్పతనాన్ని పొగడకపోయినా కనీసం మనదేశాన్ని మనమే కించపరకాకుండా ఉంటే చాలు. మన తెలివితేటలు, మన శక్తియుక్తులు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన ముందు తరాలవారు తెలియచేశారు.

భారతీయులు ఎవరికీ తీసిపోరు, వారికి ఎవరూ సాటిరారు.

పొగడరా నీతల్లి భూమిభారతిని,నిలపరా నీజాతి నిండు గౌరవమును.

భారతీయునిగా పుట్టినందుకు గర్వించు.

Post a Comment

0 Comments